ఒంటిమిట్టలో భక్తులు స్నానం చేస్తుండగా సెల్‌ఫోన్‌లో రికార్డ్

-

ఆలయానికి వచ్చిన మహిళా భక్తులు స్నానం చేస్తుండగా ఓ యువకుడు మొబైల్ ఫోన్​లో రికార్డు చేయడానికి ప్రయత్నించాడు. ఈ ఘటన వైయస్‌ఆర్‌ జిల్లాలోని ఒంటిమిట్ట ఆలయం వద్ద గురువారం రోజున చోటుచేసుకుంది. రామయ్య దర్శనం కోసం రెండు కుటుంబాలు ఒంటిమిట్టకు వచ్చాయి. ఉదయం 9.30 గంటలకు ఇద్దరు మహిళలు ఆలయ సమీపంలోని తాత్కాలిక మరుగుదొడ్లలో స్నానం చేయడానికి వెళ్లడం గమనించిన ఓ యువకుడు వెంటిలేటర్ వద్దకు వెళ్లారు. వెంటిలేటర్లో నుంచి చేతిలో ఫోన్​తో లోపలకు తొంగిచూస్తుండగా వారు గమనించి గట్టిగా కేకలు వేశారు. దీంతో దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు.

దీనిపై భద్రతా సిబ్బందికి ఫిర్యాదు చేయడంతో వారు పరిసర ప్రాంతాల్లో గాలింపు చేపట్టినా యువకుడి ఆచూకీ లభించలేదు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలు కూడా కొన్నిరోజులుగా సక్రమంగా పనిచేయడం లేదు. మహిళల స్నానపుగదులు, వస్త్రాలు మార్చుకునే గదుల వద్ద భద్రతా చర్యలు తీసుకుంటామని.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని డిప్యూటీ ఈవో నటేష్‌బాబు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news