ఇబ్బంది పెడితే హెరిటేజ్, ప్రియా ఎలా నడుస్తున్నాయి – మంత్రి గుడివాడ అమర్నాథ్

-

ఏపీలో పెట్టుబడులపై టీడీపీ, ఆ పార్టీ అనుకూల పత్రికలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు మంత్రి గుడివాడ అమర్నాథ్. ఏపీ నుంచి పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వం ఇబ్బంది పెడితే చంద్రబాబు హెరిటేజ్, ప్రియా, ఈనాడు సంస్థలు ఎలా నడుస్తున్నాయని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ఏదో రకంగా బదనాం చేయాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

దేశ జీడీపీతో పోలిస్తే రాష్ట్ర జిడిపి 2% ఎక్కువగా ఉందని అన్నారు. ఆ వార్తలు సిరాతో రాసినవి కాదని.. చంద్రబాబు కోసం సారా తాగి రాసిన వార్తలని ఎద్దేవా చేశారు. అమర్ రాజా సంస్థ ప్రతినిధులు ఎక్కడైనా ఏపీలో పెట్టాల్సిన పెట్టుబడులు తెలంగాణలో పెడుతున్నామని చెప్పారా? అని ప్రశ్నించారు. అమర్ రాజా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో ఉందని.. అందులో భాగంగానే ఇతర రాష్ట్రాలలో కూడా పెట్టుబడులు పెడుతుంది అన్నారు. ఆ సంస్థను ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమేసినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news