పవన్ కళ్యాణ్ వారాహి ఎక్కి పిచ్చికూతలు కూస్తున్నారు – మంత్రి అంబటి

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టిడిపి అధినేత నారా చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు మంత్రి అంబటి రాంబాబు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ వారాహి ఎక్కి పిచ్చికూతలు కూస్తున్నాడని మడిపడ్డారు. ప్రభుత్వంపై శృతి మించి అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. దోపిడీలు చేసేందుకే చంద్రబాబు ప్రభుత్వం ప్రాజెక్టులను ప్రారంభించిందని విమర్శించారు.

ప్రాజెక్టుల పేరుతో గత ప్రభుత్వం భారీగా దోచుకుందని ఆరోపించారు. పట్టిసీమ పేరుతో భారీ ఎత్తున దోపిడీ చేశారని అన్నారు అంబటి. పోలవరాన్ని చంద్రబాబు నిర్వీర్యం చేశారని, పట్టిసీమ పేరుతో తన వాళ్లకు కాంట్రాక్టులు అప్పగించి రూ. 834 కోట్లు విచ్చలవిడిగా ఖర్చు పెట్టారని అన్నారు. పవన్ కళ్యాణ్ – చంద్రబాబు ఇద్దరిలోనూ అసహనం కనిపిస్తుందని దుయ్యబట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news