మంత్రి లోకేష్ కీలక నిర్ణయం.. పదోతరగతి విద్యార్థులకు రిలీఫ్

-

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో  చదువుతున్న 77 వేల మంది పదో తరగతి విద్యార్థులకు ఊరట కలిగేలా మంత్రి లోకేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో CBSE అనుబంధ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు ఈ సంవత్సరం నుంచి రాష్ట్ర బోర్డు పరీక్షలు రాసేందుకు వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు. అంతర్గత పరీక్షల ఫలితాల ఆధారంగా మంత్రి లోకేశ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్ర బోర్డు పరీక్షలకు, CBSEలకు తేడా ఉంటుంది. ఈ నేపథ్యంలో CBSE అనుబంధ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సామర్థ్యాలను  తెలుసుకునేందుకు ఇటీవల విద్యాశాఖ పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల్లో 64 శాతం మంది ఉత్తీర్ణులు కాలేదని తెలిపారు. అలాగే 326 పాఠశాలలో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదు. 556 పాఠశాలల్లో 25 శాతం లోపే ఉత్తీర్ణత శాతం నమోదైంది. 66 పాఠశాలల్లో 26 నుంచి 50 శాతం మాత్రమే ఉత్తీర్ణులయ్యారు.ఈ ఫలితాలపై మంత్రి లోకేష్ దృష్టికి తీసుకురాగా CBSE విద్యార్థులకు రాష్ట్ర బోర్డు పరీక్షలకు అనుమతించాలని నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు లోకేష్. 

Read more RELATED
Recommended to you

Latest news