ఏపీ టెట్ సిలబస్ మార్పు పై క్లారిటీ ఇచ్చిన మంత్రి నారా లోకేష్

-

గత ఐదేళ్లుగా ఉపాధి, ఉద్యోగాలు లేక నిరాశ నిస్పృహల్లో మునిగి ఉన్న యువతకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కొత్త ఆశలు చిగురించాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం సైతం మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాల ప్రకారమే నడుచుకుంటోందని ప్రజలు కొనియాడుతున్నారు. ఎన్నికల సమయంలో నారా చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం.. డీఎస్సీ ఫైల్ పై తొలి సంతకం చేయడం అందరికీ తెలిసిందే.

త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ సైతం విడుదల కానున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో డీఎస్సీ సిలబస్ అంశంలో పలు అనుమానాలు ఉన్నట్టు అభ్యర్థలు పేర్కొంటున్నారు. కాగా మంత్రి నారా లోకేష్ ఆ అనుమానలపై ట్విట్టర్ వేదికగా స్పంధించారు. టెట్, మెగా డీఎస్సీ నిర్వహణపై పాఠశాల విద్య ఉన్నతాధికారులతో తాను సమీక్షించినట్టు తెలిపారు. టెట్, మెగా డీఎస్సీ మధ్య ఎక్కువ సమయం ఉండాలని అభ్యర్థుల నుంచి వస్తున్న విజ్ఞప్తులని పరిశీలించాలని సూచించినట్టు పేర్కొన్నారు.

అలాగే టెట్ సిలబస్ మార్పు జరిగిందని వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. సిలబస్ లో ఎటువంటి మార్పులు చేయలేదని స్పష్టం చేశారు. సిలబస్ వివరాలను https://aptet.apcfss.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని.. మెగా డీఎస్సీలో కొన్ని జిల్లాలకు ఎదురైన న్యాయపరమైన అదేశించినట్లు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news