వెన్నుపోటుతో పార్టీని లాక్కున్న వ్యక్తి శతజయంతి ఉత్సవాలు నిర్వహించడం హాస్యాస్పదం – మంత్రి రోజా

-

ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా టిడిపి అధినేత నారా చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు మంత్రి ఆర్కే రోజా. వెన్నుపోటుతో పార్టీని లాక్కున్న వ్యక్తి శతజయంతి ఉత్సవాలు నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చంద్రబాబుకు ఎన్టీఆర్ మీద ప్రేమ పుట్టుకు వస్తుందని విమర్శించారు రోజా. చంద్రబాబు తడిగుడ్డతో గొంతు కోసే వ్యక్తి అని మండిపడ్డారు.

ఆయనకి నిజంగా ఎన్టీఆర్ పై ప్రేమ ఉంటే 14 ఏళ్ళుగా ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క జిల్లాకు కూడా ఎన్టీఆర్ పేరు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. భార్యని చూసుకోలేని వ్యక్తి దేశాన్ని ఏం ఉద్ధరిస్తాడని మోడీని తిట్టారని.. రాహుల్ గాంధీతో చేతులు కలిపి మోడీని గద్దె దించుతానని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడేమో జాతీయ మీడియాతో మోడీ విజన్ గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news