డబుల్ ఇంజన్ సర్కార్ తోనే తెలంగాణ అభివృద్ధి – ఎంపీ సోయం బాపూరావు

-

కొమరం భీం: సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు. కాగజ్ నగర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఒప్పుకోవడం ఈ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిన అనడానికి నిదర్శనం అన్నారు. దళిత బంధు స్కీం లో మూడు లక్షల వసూలు చేస్తే ఇది దేనికి సంకేతం అని ప్రశ్నించారు. కెసిఆర్ సర్కార్ విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటుందని మండిపడ్డారు సోయం బాపూరావు.

ఇక్కడి రాష్ట్రంలో అకాల వర్షాలకు పంటలు దెబ్బతిని రైతులు కన్నీళ్లు పెడుతుంటే.. కెసిఆర్ మాత్రం రాజకీయాల కోసం పక్క రాష్ట్రంలో మీటింగులు, ఎమ్మెల్యేలు, మంత్రులు సమ్మేళనాల పేరుతో డాన్సులు చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం ఇస్తున్న ఫసల్ బీమా ఇక్కడ అమలు చేస్తే రైతులకు పరిహారం దక్కేదన్నారు సోయం బాపూరావు. తెలంగాణ ప్రజలు బిజెపి వైపు చూస్తున్నారని.. డబుల్ ఇంజన్ సర్కార్ తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం అన్నారు. రైతుల కష్టాలను తెలుసుకునేందుకు కనీసం పరామర్శకు కూడా సీఎం కేసీఆర్ రాకపోవడం ఆయన పాలనకు నిదర్శనమని.. దీనిని రైతులు గమనించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news