మంత్రి రోజాకి జనసేన వీర మహిళల వార్నింగ్..!

-

ఆంధ్రప్రదేశ్ లో ఈ మధ్య రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ముఖ్యంగా వైఎస్సార్, జనసేన నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేస్తున్న ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజాకి జనసేన వీర మహిళలు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యంగా రోజా ఓ కంత్రిలాగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ పై రోజా నోరు పారేసుకోవడం అంత మంచిది కాదని వార్నింగ్ ఇచ్చారు. గతంలో కత్తి మహేష్ అలాగే చేస్తే ఆయన గతి ఏమైందో చెప్పాక్కర్లేదు.రోజా గతి కూడా కత్తి అలాగే అవుతుందని గుర్తుంచుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. 

తిరుపతిలో ఆకేపాటి సుభాషిని మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తప్పా అని వ్యాఖ్యానించారు. రుషికొండను బోడిగుండు చేసిన వైసీపీ దోపిడికి అంతులేదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలను దోచేస్తున్న వైసీపీ నుంచి ఏపీని కాపాడాలనే తపనతో పవన్ ప్రజల్లో వెళ్లి ప్రశ్నిస్తున్నట్టు తెలిపారు. వైసీపీ మంత్రులు అందరూ సీఎం వేసే బిస్కేట్లకు ఆశపడి తమ అధ్యక్షుడిపై నోరు పారేసుకుంటున్నారని వీర మహిళలు కౌంటర్ ఇచ్చారు. నెత్తిపై రూపాయి పెడితే పావలాకి కూడా అమ్ముడు పోని రోజా పెద్ద జ్ఞానిలా మాట్లాడుతుందని స్పందించారు. 

Read more RELATED
Recommended to you

Latest news