అవినాష్ రెడ్డి తల్లి అనారోగ్యంపై వైసీపీ ఎంపీ వివాదస్పద వ్యాఖ్యలు

-

అవినాష్ రెడ్డి తల్లి అనారోగ్యంపై వైసీపీ ఎంపీ రఘురామ వివాదస్పద వ్యాఖ్యలు అవినాష్ రెడ్డి తల్లి గారు అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యారని చెబుతుంటే ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలు ఎవరు నమ్మడం లేదని, ఆమె ఆరోగ్యంతోనే ఉన్నారని అయినా అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరినట్లుగా డ్రామాలాడుతున్నారని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు.

అవినాష్ రెడ్డి తల్లి గారు అనారోగ్యంతో ఉంటే వై.యస్. విజయమ్మ గారి చూడనివ్వకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందని, అదే వై.యస్. విమల గారు చూసేందుకు అనుమతినివ్వడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. అయితే అవినాష్ రెడ్డి తల్లి గారి ఆరోగ్యం మెరుగుపడి ఉండాలని అన్నారు. రామోజీరావు గారు అనారోగ్యంతో ఉన్నారంటే సీఐడీ పోలీసులు వైద్యులను పంపి నిర్ధారణ పరీక్షలు చేయిస్తామని చెప్పారని రఘురామకృష్ణ రాజు గుర్తు చేశారు. మరి ఇప్పుడు వై.యస్. అవినాష్ రెడ్డి తల్లి గారికి ఆరోగ్య పరీక్షలు చేయిస్తామని సీబీఐ అధికారులు వైద్యులను పంపితే అనుమతిస్తారా అంటూ సందేహాన్ని వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news