మా కుటుంబంలో అందరినీ చంపించేయండి – ముద్రగడ పద్మనాభరెడ్డి

-

మమ్మల్ని బూతులతో తిట్టించే బదులు.. మా కుటుంబంలో ఏడుగురుము ఉన్నాం… అందరినీ చంపించేయండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి. మేము అనాధలం ఎవరు అడ్డుకోరు… ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక సినిమాలు వదిలేశారు.. పవన్ కళ్యాణ్ కూడా సినిమా లు వదిలేసి ప్రజాసేవ చేయాలని కోరారు. నేను ఒత్తిడి చేసి నా పేరు త్వరగా మార్చమని కోరాను… నా సవాల్ కు కట్టుబడి నా పేరు మార్చుకున్నానని గుర్తు చేశారు.

Pawan Kalyan, Mudragada meeting next week

పౌర్ణమి తర్వాత అమావాస్య కూడా వస్తుంది అది గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి. వైసీపీ సానుభూతిపరులు ఇళ్లపై దాడులు చేస్తున్నారు వెంటనే ఆపాలని కోరారు. నేను చేతకాని వాడిని అసమర్థుడు ను కాబట్టి పవన్ కళ్యాణ్ ను ఉద్యమం చేయాలని కోరానని చెప్పారు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పవన్ కళ్యాణ్ చేతుల్లో ఉన్నాయి కాబట్టి కాపులకు రిజర్వేషన్ సాధించాలన్నారు. ప్రత్యేక హోదా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం కోసం పోరాడాలని వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి డిమాండ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news