వల్లభనేని వంశీ ఓ పిల్ల సైకో – నారా లోకేష్

-

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పై తీవ్ర విమర్శలు చేశారు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. వల్లభనేని వంశీ ఒక పిల్ల సైకో అంటూ దుయ్యబట్టారు. ఆ పిల్ల సైకోకి త్వరలోనే రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని వార్నింగ్ ఇచ్చారు. దేవాలయం లాంటి పార్టీ కార్యాలయంపై పిల్ల సైకో దాడి చేశారని మండిపడ్డారు. పిల్ల సైకో మనస్తత్వం తెలియక మేము టికెట్ ఇచ్చి తప్పు చేశామన్నారు నారా లోకేష్.

గన్నవరంలో ఉండే పార్టీ కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడని హామీ ఇచ్చారు. గన్నవరంలో ఉన్న పిల్ల సైకోని శాశ్వతంగా రాజకీయాలకు దూరంగా పెట్టాలన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న వైసీపీ కుక్కలు నారా లోకేష్ క్షమాపణ చెప్పి పాదయాత్ర చేయాలని వాగుతున్నారని.. టీడీపీ హయాంలో కృష్ణా జిల్లాని అభివృద్ధి చేసినందుకు క్షమాపణ చెప్పాలా..? అని ప్రశ్నించారు.

చంద్రబాబు నన్ను కుప్పంలో పోటీ చేయమన్నా… నేను మంగళగిరిలోనే పోటీ చేశానని తెలిపారు. మంగళగిరిలో ఓడిపోయాక నాలో కసి పెరిగిందన్నారు లోకేష్. వచ్చే ఎన్నికల్లో మంగళగిరిలో గెలిసి చంద్రబాబుకు కానుకగా ఇస్తానన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news