కేసీఆర్ ఎగతాళి చేసినా సైకో జగన్ కు సిగ్గూ, లజ్జాలేదు – నారా లోకేష్‌

-

కేసీఆర్ ఎగతాళి చేసినా సైకో జగన్ కు సిగ్గూ, లజ్జాలేదని చురకలు అంటించారు టీడీపీ అగ్రనేత నారా లోకేష్‌. గుంతల్లో రోడ్డు వెదుక్కోవడమే జలగన్న జమానాలో వెరైటీ అంటూ ఏపీ రోడ్లపై ట్వీట్‌ చేశారు లోకేష్‌. సాధారణంగా దేశంలో ఎక్కడైనా రోడ్లపై గుంతలు కామన్ అన్నారు. అయితే జలగన్నజమానాలో గుంతల్లో అక్కడక్కడ మాత్రమే రోడ్డు కన్పించడం వెరైటీ అంటూ చురకలు అంటించారు.

nara lokesh on ap roads over ts

ఇది యలమంచిలి నియోజకవర్గం తిమ్మరాజుపేట ప్రధాన రహదారి అని… రహదారి పొడవునా భారీగోతులతో నిండిపోయి రోడ్డు ఎక్కడుందా అని వెదుక్కునే పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. ఇటీవల పొరుగు తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి కెసిఆర్ డబుల్ రోడ్డు అయితే తెలంగాణా, సింగిల్ రోడ్డు ఉంటే ఎపి అని ఎగతాళి చేసినా సైకో సిఎం జగన్ కు సిగ్గూ,లజ్జాలేదన్నారు. అస్తవ్యస్తమైన పాలనతో 12 లక్షలకోట్ల అప్పుతో ఖజానా ఖాళీచేసి రోజువారీ ఖర్చులకు కూడా వెదుక్కునే పరిస్థితి తెచ్చాడని ఆగ్రహించారు. ఈ దివాలాకోరు ముఖ్యమంత్రి మొఖం చూసి కాంట్రాక్టర్లు పరారవుతున్నారు. అందుకే యావత్ ఆంధ్రపదేశ్ నోట ఇప్పుడు వస్తున్న మాట సైకో పోవాలి… సైకిల్ రావాలి?! అంటూ లోకేష్‌ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news