రెడ్ బుక్ తెరవక ముందే..ఢిల్లీ వెళ్లి గగ్గోలు పెడుతున్నావ్‌ – నారా లోకేష్‌

-

రెడ్ బుక్ తెరవక ముందే..ఢిల్లీ వెళ్లి గగ్గోలు పెడుతున్నావ్‌ అంటూ చురకలు అంటించారు మంత్రి నారా లోకేష్‌. రెడ్‌ బుక్‌ పై అసెంబ్లీ లాబీలో మీడియాతో మంత్రి నారా లోకేష్ చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా నారా లోకేష్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాదగ్గర రెడ్ బుక్ ఉందని నేనే దాదాపు 90బహిరంగ సభల్లో చెప్పానన్నారు నారా లోకేష్.

YCP chief Jagan’s meeting with party MLCs ended

తప్పు చేసిన వారందరి పేర్లు రెడ్ బుక్ లో చేర్చి చట్టప్రకారం శిక్షిస్తామని చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నానని.. ఇంకా రెడ్ బుక్ తెరవక ముందే జగన్ దిల్లీ దాకా వెళ్లి గగ్గోలు పెడుతున్నాడని చురకలు అంటించారు. పీవీ నరసింహారావు కు భారతరత్నపై స్పందించమని జాతీయ మీడియా కోరితే విజయసాయి పేరు చెప్పి వెళ్ళిపోయాడని ఆగ్రహించారు.

రెడ్ బుక్ కు మాత్రం జాతీయ మీడియా వెంటపడి బతిమాలి పిలిపించి మరీ ప్రచారం కల్పించాడు… గత 5ఏళ్ల కాలంలో జగన్ 2ప్రెస్మీట్ లు పెడితే…, 11సీట్లు వచ్చాక నెల రోజుల వ్యవధిలో 5ప్రెస్మీట్ లు పెట్టాడని ఎద్దేవా చేశారు. జగన్ చెప్పే అసత్యాలేవో అసెంబ్లీకి వచ్చి చెప్తే వాస్తవాలు మేం వివరిస్తాం కదా… జగన్ అసెంబ్లీ కి వస్తే గౌరవంగా చూసుకుని వాస్తవాలు అర్ధమయ్యేలా వివరిస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news