రేపటి నుంచి అమెరికా పర్యటనకు నారా లోకేశ్..కారణం ఇదే

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ అమెరికా పర్యటన ఖరారు అయింది. రేపటి నుంచి అమెరికా పర్యటనకు ఏపీ మంత్రి నారా లోకేష్ వెళ్లనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారు అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించేందుకు అమెరికాకు వెళ్తున్నారు లోకేష్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు నారా లోకేష్. అలాగే విద్యాశాఖ మంత్రిగా కూడా కొనసాగుతున్నారు.

అయితే ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విపరీతంగా పెట్టుబడులు తెచ్చేందుకుగాను అమెరికా పర్యటనకు వెళ్తున్నారు మంత్రి నారా లోకేష్. రేపటి నుంచి నవంబర్ ఒకటో తేదీ వరకు అంటే దాదాపు వారం రోజులకు పైగా… నారా లోకేష్ అమెరికాలో పర్యటించబోతున్నారన్నమాట. ఇక ముఖ్యంగా ఈ పర్యటనలో గూగుల్ మైక్రోసాఫ్ట్ అమెజాన్ రాకిల్, పెప్సికో లాంటి కంపెనీలతో చర్చలు నిర్వహించనున్నారు నారా లోకేష్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోల్ బడులు పెట్టేందుకు గల అవకాశాలను ఈ సందర్భంగా ఆయా కంపెనీలకు నారా లోకేష్ వివరించనన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news