ఏపీలో త్వరలోనే నూతన మద్యం పాలసీ – మంత్రి కొల్లు రవీంద్ర

-

ఏపీలో త్వరలోనే నూతన మద్యం పాలసీ ప్రకటిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటన చేశారు. ఇవాళ తిరుమలకు మంత్రి కొల్లు రవీంద్ర వచ్చారు. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారినికి దర్శించుకుని మాట్లాడారు మంత్రి కొల్లు రవీంద్ర. త్వరలోనే నూతన మద్యం పాలసిని ప్రకటిస్తామని చెప్పారు మంత్రి కొల్లు రవీంద్ర.

New liquor policy in AP soon said kollu ravindra

గత పాలకులు అన్ని వ్యవస్థలను నాశనం చేసారు..ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ర్ట ఆర్దిక పరిస్థిని పూర్తిగా అప్పులు పాలు చేశారని నిప్పులు చెరిగారు మంత్రి కొల్లు రవీంద్ర. మా మీద నమ్మకంతో గెలిపించిన ప్రజలకు ఐదు సంవత్సరాలు స్వచ్చమైన పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. గత పాలకులుకు కోంత మంది అధికార్లు వత్తాసు పలికి అవినీతిలో తమ వంతు పాత్ర పోషించారని వివరించారు మంత్రి కొల్లు రవీంద్ర. ఏపీ ప్రజలకు న్యాయం చేసేలా పని చే స్తామని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news