నూతన సంవత్సరం.. వాహనదారులకు కొత్త నిబంధనలు..!

-

నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతూనే కేంద్రం ప్రభుత్వం వాహదారులకు పెద్ద షాక్ ఇచ్చింది. కొత్త నిబంధనలను జారీ చేస్తూ.. రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ శనివారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నిబంధనలు 2021 జనవరి 1 నుంచే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. అయితే ఆ నిబంధనలు ఏంటో తెలుసుకుందాం రండి.

vechile
vechile

ఎలక్ట్రానిక్ విధానంలో టోల్‌ వసూళ్లను మరింతగా పెంచే ఉద్దేశంతో అన్ని ఫోర్‌ వీలర్లకు ఫాస్టాగ్‌ను తప్పనిసరి చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గతంలో మినహాయింపు పొందిన పాత వాహనాలు ఇకపై తప్పనిసరిగా ఫాస్టాగ్‌ తీసుకోవాల్సిందే. ఈ మేరకు రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ శనివారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. 1989నాటి మోటారు వాహన చట్టంలో కేంద్రం పలు మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దాని ప్రకారం 2017 డిసెంబర్ 1 కంటే ముందు కొన్న వాహనాలకు ఈ నిబంధనలు వర్తించనున్నాయి.

దీని ముఖ్య ఉద్దేశం టోల్ గేట్ దగ్గర ట్రాఫిక్ ను నియంత్రించడమేనట. అందుకు అనుగుణంగానే కేంద్రం 2017 నుంచి కేంద్రం ఫాస్టాగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. అందులో భాగంగానే 2019 అక్టోబర్ నాటికి దేశవ్యాప్తంగా ఫాస్టాగ్ విధానాన్ని తప్పనిసరి చేసింది. అయితే ఈ విధానంలో ద్విచక్ర, మూడు చక్రాల వాహనాలతో పాటు పాత వాహనాలకు ఫాస్టాగ్‌ నుంచి మినహాయింపు ఇచ్చింది. తాజా ఉత్తర్వుల ప్రకారం వచ్చే ఏడాది నుంచి అన్ని నాలుగు చక్రాల వాహనాలకూ ఫాస్టాగ్‌ తప్పనిసరైంది.

ఇకపై ట్రాన్స్‌పోర్ట్‌ వాహనాలకు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ రెన్యువల్‌ చేయించాలంటే ఫాస్టాగ్‌ తప్పనిసరి అని తాజా నిబంధనల్లో పేర్కొంది. అలాగే థర్డ్‌ పార్టీ బీమా తీసుకోవాలన్నా.. ఫాస్టాగ్‌ తీసుకోవాలన్న నిబంధనను వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి అమలు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. తాజా నోటిఫికేషన్‌ ప్రకారం టోల్‌ ప్లాజాల వద్ద 100 శాతం ఫాస్టాగ్‌ ద్వారానే చెల్లింపులు జరగనున్నాయి. అయితే కేంద్రం ప్రవేశపెట్టిన ఈ విధానం ఎంతవరకూ అమలవుతోందో వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news