రాష్ట్రంలో ఉద్యోగాలు నిల్.. గంజాయి ఫుల్ – నారా లోకేష్

-

రాష్ట్రంలో ఉద్యోగాలు నిల్.. గంజాయి ఫుల్ అని విమర్శించారు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడిన దాని మూలాలు ఆంధ్రప్రదేశ్ లోనే ఉంటున్నాయని ఆరోపించారు. కంచుకోటలో గెలిచి గొప్పలు చెప్పడం కాదని.. వైఎస్ఆర్సిపి గెలవనిచోట పోటీ చేసి గెలిచే సత్తా జగన్ కు ఉందా? అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీకి గతంలో ఏమాత్రం పట్టు లేని మంగళగిరిలో గెలిచి కంచుకోటగా మారుస్తానని ధీమ వ్యక్తం చేశారు.

విశాఖలో జరిగింది లోకల్ ఫేక్ సమ్మేట్ అని సెటైర్లు వేశారు. టిడిపి హయాంలో వచ్చిన కంపెనీలు జగన్ పాలనలో బై బై చెప్పాయన్నారు నారా లోకేష్. ఏపీలో ఉన్న కంపెనీలు విస్తరణ చేపట్టడం లేదని.. అమర్ రాజా తో పాటు ప్రముఖ కంపెనీలు వెళ్లిపోయాయని అన్నారు. పిపీఏలు రద్దు చేయవద్దని కేంద్రం హెచ్చరించినా జగన్ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news