బ్రేకింగ్: మీడియాకు షాక్ ఇచ్చిన నిమ్మగడ్డ

-

ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల కమీషనర్ కాస్తా ప్రస్తుత ఎన్నికల కమీషనర్ గా మారిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీడియాకు షాక్ ఇచ్చారు. ఆయన నేడు బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది అని అందరూ భావించారు. ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు అన్ని మీడియా చానల్స్ లో హడావుడి అయింది. కాని ఆయన అనూహ్యంగా మీడియాకు షాక్ ఇచ్చారు. సైలెంట్ గా బాధ్యతలు చేపట్టారు నిమ్మగడ్డ.

తాజాగా విజయవాడ వచ్చిన ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. ఎన్నికల కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ సంస్థ అని ఆయన అన్నారు. రాగ ద్వేషాలకు అతీతంగా ఎస్ఈసీ పని చేస్తుంది అని ఆయన స్పష్టం చేసారు. గతంలో మాదిరిగానే ప్రభుత్వం నుంచి తొడ్పాటు లభిస్తుందని ఆశిస్తున్నా అంటూ వ్యాఖ్యలు చేసారు. శుక్రవారమే హైదరాబాద్ క్యాంప్ ఆఫీసులో బాధ్యతలు స్వీకరించా అంటూ షాకింగ్ కామెంట్స్ చేసారు. బాధ్యతలు స్వీకరించిన విషయాన్ని జిల్లా కలెక్టర్లకు తెలియచేశామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news