ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. 3,295 ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్

-

ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. 3,295 ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమైంది జగన్‌ సర్కార్. యూనివర్సిటీలు, ట్రిపుల్ ఐటీల్లో 3295 అధ్యాపక పోస్టుల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా… ఈనెల 23న APPSC నోటిఫికేషన్ ఇవ్వనుంది.

సెప్టెంబర్ 3, 4 వారాల్లో ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించి… అక్టోబర్ 10 నాటికి ఫలితాలు విడుదల చేయనున్నారు. ఫలితాలు విడుదలైన నెల రోజుల్లో ఇంటర్వ్యూలు నిర్వహించి… నవంబర్ 15 నాటికి ప్రక్రియ పూర్తి చేయనున్నారు. అదేరోజు ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల కానుంది.

కాగా, అమ్మ ఒడి పథకం కింద లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం రూ.13,000 జమ చేయగా… కొందరి అకౌంట్లలో ఇంకా డబ్బులు పడలేదు. EKYC పెండింగ్ లో ఉన్న వారి వివరాలను తాజాగా విడుదల చేసిన ప్రభుత్వం… రెండు రోజుల్లో వారంతా సమీపంలోని గ్రామ/వార్డు సచివాలయాల్లో EKYC పూర్తి చేయాలని ఆదేశించింది. ఏకీక పూర్తయిన వారికి వచ్చే వారం అకౌంట్లో డబ్బులు జమ చేస్తామని వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news