ముద్రగడ కుటుంబాన్ని చంద్రబాబు ఏ విధంగా వేధించారో పవన్ కి తెలియదా..? – మంత్రి కొట్టు

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టిడిపి అధినేత నారా చంద్రబాబుకు పై తీవ్ర విమర్శలు చేశారు మంత్రి కొట్టు సత్యనారాయణ. నేడు పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ రాజకీయాల కోసం కాపులను వాడుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ పని చేసేది చంద్రబాబు కోసమేనని దుయ్యబట్టారు. కాపులను ఏకం కాకుండా చంద్రబాబు అడ్డుకున్నారని మండిపడ్డారు.

ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని చంద్రబాబు ఏ విధంగా వేధించారో పవన్ కళ్యాణ్ కి తెలియదా..? అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కాపు రిజర్వేషన్లు ఇస్తామని నువ్వు గాని.. నీ దత్త తండ్రి గాని చెప్పగలరా..? అని నిలదీశారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబులను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news