మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం – రేవంత్ రెడ్డి

-

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం తెలంగాణ కాంగ్రెస్ నేతల్ని సంతోషపెడుతుంది. ఈ నేపథ్యంలోనే కర్ణాటక కాంగ్రెస్ మేనిఫెస్టోను తెలంగాణలోనూ అమలు చేయాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. అధికారంలోకి వస్తే కర్ణాటకలో మాదిరిగానే ఇక్కడ కూడా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అవకాశం కల్పిస్తామని అన్నారు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. నేడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కీలక హామీలు ఇచ్చారు.

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పేదలు కొత్త ఇల్లు కట్టుకునేందుకు ఐదు లక్షలు ఇస్తామని చెప్పారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ, 500 కే గ్యాస్ సిలిండర్, బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం వంటి కీలక హామీలు ఇచ్చారు. అదిలాబాద్ కి బిఆర్ఎస్ చేసింది ఏమీ లేదని.. అదిలాబాద్ జిల్లాను కాంగ్రెస్ దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తుందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news