ఏపీని…. బీహార్ రాష్ట్రంగా మార్చారు – పవన్ కళ్యాణ్

-

ఏపీ ని బీహార్ గా మార్చారని ఫైర్ అయ్యారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ద్వారంపూడి దగ్గర తిప్పి కొడితే 500 మంది గుండాలు లేరు….ద్వారంపూడి అక్రమాలు పై సెంట్రల్ హోమ్ మినిస్టర్, ఏపీ డీ జీ పీ కి, జనసేన ఆఫీస్ కి ఫోటో తీసి టాగ్ చేయండన్నారు.

జనసేన ప్రభుత్వం వచ్చిన రోజున బట్టలు ఉడదీసి కాకినాడ లో తిప్పుతాను… ద్వారంపూడి నువ్వు డబ్బులు ఎక్కువ అయ్యి బలిసి కొట్టుకుంటున్నావని మండిపడ్డారు. నీ క్రిమినల్ ఎంపర్ ను నేల మట్టం చేసి… జగన్ ను రోడ్డు మీదకి తీసుకు వస్తానని హెచ్చరించారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.పవన్ కల్యాణ్ యువతను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు.

యువత సినిమాను, రాజకీయాలను వేరు చేసి చూడాలని పిలుపునిచ్చారు. తాను కోరుకునేది ఇదేనని తెలిపారు. సినిమాల్లో ఉండే అభిమానం వేరు, రాజకీయం వేరు అని స్పష్టం చేశారు. నన్ను చంపేస్తామని రకరకాలుగా బెదిరిస్తుంటారు… అయినప్పటికీ ప్రజల కోసం దశాబ్దకాలంగా పాటుపడుతున్నానని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news