రంగా పేరు పలికే అర్హత పవన్ కళ్యాణ్ కి లేదు – మల్లాది విష్ణు

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. వంగవీటి మోహనరంగా పేరు పలికే అర్హత కూడా పవన్ కళ్యాణ్ కి లేదన్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు పల్లకి మోస్తే.. రంగా అభిమానులు కూడా మోయాలా..? అని ప్రశ్నించారు. రంగా బొమ్మ పెట్టుకుని సైకిల్ గుర్తుకు ఓటేస్తే రంగా ఆత్మ శాంతిస్తుందా..? అని నిలదీశారు. రంగాని చంపింది చంద్రబాబు నేతృత్వంలోని టిడిపి పార్టీ కాదా..? అని ప్రశ్నించారు మల్లాది విష్ణు.

రంగా వెన్నులో దిగిన కత్తి.. ఆయన పై విసిరిన బాంబు టీడీపీ ది కాదా..? చంద్రబాబుది కాదా..? అంటూ దుయ్యబట్టారు. రంగా మాకు దైవం.. గురువు.. ఆయనే మాకు ఆదర్శం అని అన్నారు. టిడిపి నేతలు, పవన్ కళ్యాణ్ దయచేసి రంగా పేరును వాడొద్దు.. పలకద్దని అన్నారు. రంగా పేరును వాడే అర్హత వైయస్సార్ అభిమానులమైన మాకే ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news