పవన్ కళ్యాణ్ పిచ్చి కుక్కతో సమానం – మంత్రి జోగి రమేష్

-

గుంటూరు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు మంత్రి జోగి రమేష్. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీసీలను వాడుకుని బానిసలుగా చేసిన చరిత్ర చంద్రబాబుదని మండిపడ్డారు. బీసీల ఓట్ల కోసం బీసీల మాట ఎత్తితే తాట తీస్తాను చంద్రబాబు జాగ్రత్త.. అంటూ హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి పిచ్చికుక్కతో సమానమని తీవ్ర విమర్శలు చేశారు.

వీధి కుక్కలు మొరుగుతాయి.. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ ని జనం తరిమి తరిమి కొడతారని వ్యాఖ్యానించారు. ఇక తాము పొత్తులతో వెళ్ళమని.. సింహం లాగా సింగిల్ గా వెళతామని స్పష్టం చేశారు. ఏపీలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news