BREAKING : నేడు ఇంద్రకీలాద్రికి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌

-

BREAKING : నేడు ఇంద్రకీలాద్రికి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ వెళ్లనున్నాడు. నిన్న కొండగట్టుకు వెళ్లిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌..ఇవాళ విజయవాడ దుర్గమ్మను దర్శించుకోనున్నారు. జనసేన ఎన్నికల ప్రచార వాహనం వారాహికి విజయవాడ దుర్గమ్మ సమక్షంలో పూజలు నిర్వహించనున్నారు.

కాగా, జనసేన అధినేత పవన్ కల్యాణ్ జగిత్యాల పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. పవన్​ను చూసేందుకు కాన్వాయ్​ను ఫాలో అయిన యువకులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఓ యువకుడు మృతి చెందగా, మరో ముగ్గురు యువకులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news