అసెంబ్లీలో పవన్ తొలి ప్రసంగం.. ఏం మాట్లాడారంటే..?

-

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నిన్న ప్రారంభమైన విషయం తెలిసిందే. స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ కి అభినందనలు తెలుపుతూ ఇవాళ తొలుత సీఎం చంద్రబాబు మాట్లాడారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ తొలిసారిగా ప్రసంగించారు.

స్పీకర్ అయ్యన్న పాత్రుడుకు అభినందనలు చెబుతూ మాట్లాడారు. సభను సజావుగా నడిపించే సత్తా అయ్యన్నకే ఉందన్నారు. వైసీపీ నేతలకు ఓటమి స్వీకరించే సత్తా లేదని.. అందుకే వారు సభ నుంచి పారిపోయారని విమర్శించారు. గత ప్రభుత్వం మాదిరి దూషణలకు పోకుండా సర్వజనులకు మంచి జరిగేలా సభను నడిపించాలని కోరారు . మరోవైపు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయన్న పాత్రుడిపై  పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు సభలో నవ్వులు విరబూశాయి. ఉత్తరాంధ్ర యాసలో పదునైన వ్యాఖ్యలు చేయడంలో మీరు దిట్ట. రుషికొండను గుండు కొట్టినట్టుగా ప్రత్యర్థులను మాటలతో చెక్కేస్తారు. కానీ ఇకపై మీకు ఆ అవకాశం లేదు. సభలో ఎవ్వరూ పరుష పదజాలం వాడిన మైక్ కట్ చేసే బాధ్య త మీకు వచ్చిందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news