ఏపీలోని వారందరికీ షాక్‌..భూమి పట్టాలపై జగన్‌ సర్కార్‌ కీలక ఆదేశాలు

-

అటవీ భూముల ఆక్రమణల పై మంత్రి పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే జగనన్న భూహక్కు-భూరక్ష కింద సర్వే జరుగుతోందని.. సర్వే చేసే క్రమంలో ఆక్రమణకు గురైన అటవీభూములను నిర్థిష్టంగా గుర్తించాలని పేర్కొన్నారు. చట్టప్రకారం అటవీ భూములకు సర్వే నెంబర్లు ఇవ్వకూడదని.. ఈ విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.

చిత్తూరు, విశాఖపట్నం తదితర జిల్లాల్లో పెద్ద ఎత్తున అటవీ భూములు ఆక్రమణలకు గురయ్యాయని.. సెటిల్ మెంట్ ఆఫీసర్ల పేరుతో భారీగా బోగస్ పట్టాలను పొందారని వెల్లడించారు. భూ సర్వే ద్వారా ఆక్రమిత భూములకు సర్వే నెంబర్లు పొందాలనే ప్రయత్నం జరుగుతోందని.. ఆక్రమణలను రెగ్యులర్ చేసుకునేందుకు జరిగే ప్రయత్నాలను నిలువరించాలని ఆదేశించారు.

రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు సంయుక్త సర్వే నిర్వహించాలని.. తప్పుడు ధ్రువీకరణలతో అటవీ భూముల్లో పొందిన పట్టాలను రద్దు చేయాలన్నారు. అటవీ ప్రాంతాల్లో సర్వే వినతుల పై నోడల్ అధికారుల నియామకం చేస్తున్నామని.. ఆర్వోఎఫ్ఆర్ భూముల సరిహద్దులు కూడా నిర్ధిష్టంగా గుర్తించండన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news