BREAKING : విజయనగరం జిల్లా ఏకలవ్య పాఠశాలలో 14 మందికి కరోనా

-

ఏపీలో కరోనా విజృంభిస్తోంది. విజయనగరం జిల్లా మక్కువ మండలంలోని ఏకలవ్య పాఠశాలలో 14 మంది విద్యార్థులకు కరోనా సోకింది. వీరిని అధికారులు ఐసోలేషన్ లో ఉంచారు.

నిన్న ఐటిడిఏ పిఓ పాఠశాలను సందర్శించిన సమయంలో విద్యార్థులు అస్వస్థతతో ఉండటాన్ని గుర్తించి కరోనా పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి కరోనా పాజిటివ్ గా తేలింది. ఆ తర్వాత మరికొంతమందికి పరీక్షలు చేయగా 14 మంది విద్యార్థులకు కరోనా సోకినట్లు గుర్తించారు. కాగా.. ఇండియా లో గత 24 గంటల్లో 11,692 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. 66,170 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news