ఇండియా కొత్తగా 11,692 కరోనా కేసులు నమోదు..

-

భారత దేశంలో కోవిడ్ ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో ఇండియా వ్యాప్తంగా 11,692 కొత్త కోవిడ్ కేసులు నమోదు కాగా.. 33 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 66,170 యక్టీవ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 4.48 కోట్ల కేసులు నమోదు కాగా, 5.31లక్షల మంది మృతి చెందారు. కాగా, ఏపీలో కరోనా విజృంభిస్తోంది.

విజయనగరం జిల్లా మక్కువ మండలంలోని ఏకలవ్య పాఠశాలలో 14 మంది విద్యార్థులకు కరోనా సోకింది. వీరిని అధికారులు ఐసోలేషన్ లో ఉంచారు. నిన్న ఐటిడిఏ పిఓ పాఠశాలను సందర్శించిన సమయంలో విద్యార్థులు అస్వస్థతతో ఉండటాన్ని గుర్తించి కరోనా పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి కరోనా పాజిటివ్ గా తేలింది. ఆ తర్వాత మరికొంతమందికి పరీక్షలు చేయగా 14 మంది విద్యార్థులకు కరోనా సోకినట్లు గుర్తించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news