ఏపీ ప్రజలు తప్పకుండా రాజధాని ఫైల్స్ సినిమా చూడండి : చంద్రబాబు

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ రాజధాని ఫైల్స్ సినిమా చూడాలని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. వైసీపీ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చాక అమరావతిపై కక్ష కత్తి రాజధానిని నాశనం చేశారని ఫైర్ అయ్యారు. అదేవిధంగా అమరావతి రాజధానిగా ఉండాలని నిరసనలు వ్యక్తం చేసిన ఉద్యమకారులపై అధికారంతో హింసించారని.. రాజధానిలో విషప్రచారం చేశారన్నారు. అలాగే సీఎం జగన్ కుట్రలు కుతంత్రాలకు రాజధాని శీను అద్దం పడుతోందన్నారు. ఈ సినిమా రిలీజ్ కాకుండా చేయాలని వైసిపి ప్రభుత్వం చూసిందని.. కానీ వారి ఆటలు సాగలేదు అన్నారు.

ప్రతి ఒక్కరు ఈ సినిమా చూసి వాస్తవాలను తెలుసుకోవాలని చంద్రబాబు కోరారు. అయితే ఈ రాజధాని ఫైల్స్ సినిమాను అమరావతి కోసం భూములు ఇచ్చిన తర్వాత ప్రభుత్వం వారిని ఏ విధంగా చూసింది అనంతరం రాజధాని మార్పుతో ఆ ప్రాంత ప్రజల తిరుగుబాటు వారిని ప్రభుత్వం ఏ విధంగా అణచివేసిందని కాన్సెప్ట్ లో తీశారు. ఈ సినిమాకు భాను శంకర్ దర్శకత్వం వహించగా కే రవిశంకర్ నిర్మించారు. ఈ మూవీలో అఖిలాన్ పుష్పరాజ్, విశాల్ పతి, వినోద్ కుమార్ వాణి విశ్వనాథ్ వంటి నటీనటులు నటించారు.

Read more RELATED
Recommended to you

Latest news