మదనపల్లె కేసు.. వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు పోలీసుల నోటీసులు

-

అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఈ వ్యవహారంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే నవాజ్‌ బాషా ఇంట్లో పోలీసులు నోటీసులు అందించారు. విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. బెంగళూరులో ఉన్న ఆయనకు ఫోన్‌ ద్వారా సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు, పలువురు వైసీపీ నేతలను ప్రశ్నించినట్లు చెప్పారు.

మరోవైపు మదనపల్లె సబ్‌ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదానికి విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్ కారణం కానేకాదని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిసోదియా ప్రభుత్వానికి నివేదించారు. ఈ ప్రమాదానికి కారకులుగా భావిస్తున్న మాజీ ఆర్డీవోలు మురళి, హరిప్రసాద్‌తోపాటు సీనియర్ అసిస్టెంట్‌ గౌతమ్‌ తేజ్‌నూ సస్పెండ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. విద్యుత్ షార్ట్‌ సర్క్యూట్ జరగడానికి అవకాశామే లేదని స్పష్టం చేశారు. బయటి వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే ఫైల్స్ తగులబెట్టారని ఆరోపించారు. దెబ్బతిన్న సీసీ కెమెరాలనూ కుట్రకోణంతోనే బాగుచేయించలేదని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news