విశాఖ నగరంలో విసృత తనిఖీలు..!

-

విశాఖ నగరంలో విసృత తనిఖీలు చేపట్టారు అధికారులు.ఈరోజు తెల్లవారుజామున నుండి లాడ్జి లపై తనిఖీలు చేపట్టారు పోలీసులు. సీపీ బాగ్చీ ఆదేశాలతో 100 స్పెషల్ టీమ్స్ ను ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. నగరంలో ఉన్న ఏ ఒక్క లాడ్జిని కూడా వదలకుండా రైడ్ చేస్తున్నారు.

అయితే ఈ లాడ్జిల విషయంలో పక్కాసమాచారం తో పోలీసు దాడులు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఈ తనిఖీలలో భారీగా గంజాయితో పాటుగా కొంతమంది అనుమానితలను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే విశాఖకు ఇతర రాష్ట్రాల నుండి కొందరు గంజాయి స్మగ్లర్లు వచ్చినట్లు పోలీసుల వద్ద సమాచారం ఉండటంతో ఈ తనిఖీలను ప్రారంభించారు. ఈ క్రమంలోనే లాడ్జిల యొక్క రికార్డులను కూడా క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నారు పోలీసులు. ఎవరి పై అనుమానం వచ్చినా.. రికార్డుల విషయంలో అవకతవకలు ఉన్నా కూడా వారిని అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version