పాదయాత్రలో నారా లోకేష్ కి నిరసన సెగ.. గో బ్యాక్ పప్పు అంటూ నినాదాలు..

-

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నేడు కర్నూలు జిల్లాలోని ఆదోని టౌన్ లోకి చేరుకుంది. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు నారా లోకేష్ కి ఘన స్వాగతం పలికారు. నారా లోకేష్ ని చూసేందుకు యువత, వృద్ధులు, మహిళలు పెద్ద ఎత్తున రోడ్లపైకి తరలివచ్చారు. ఈ నేపథ్యంలోనే నారా లోకేష్ కి నిరసన సెగ తగిలింది. ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నారా లోకేష్ పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు వైసీపీ శ్రేణులు.

హైకోర్టుకు అడ్డు చెప్పిన టిడిపి డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గో బ్యాక్ పప్పు అంటూ నినాదాలు చేశారు వైసీపీ శ్రేణులు. దీంతో సీఎం డౌన్ డౌన్ అంటూ టీడీపీ నాయకులు నినాదాలు చేశారు. ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వివాదం ముదురుతుండడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. కావాలనే పాదయాత్రను అడ్డుకోవాలని చూస్తున్నారని డి.ఎస్.పి వినోద్ కుమార్ తో వాగ్వాదానికి దిగారు టిడిపి రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు రాజు.

Read more RELATED
Recommended to you

Latest news