దేశంలో నెంబర్ వన్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి: కృష్ణయ్య

-

దేశంలో సామాజిక న్యాయం అవలంభించిన నెంబర్ వన్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డే అని బీసీ నేత ఆర్. కృష్ణయ్య అన్నారు. బీసీలు, ఎస్టీలకు, ఎస్సీలకు సమ ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ పథకాలు ఉత్తర్ ప్రదేశ్ తో పాటు ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేస్తున్నాయని అన్నారు. పేదలు చదువుకుంటే మన పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు అవుతారని అన్నారు. చదువు వల్లనే వెనకబడిన కులాలకు గౌరవం పెరుగుతుందని ఆయన అన్నారు. అమ్మ ఒడి పథకం ద్వారా పేదలకు చదువును దగ్గర చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని కృష్ణయ్య అన్నారు. కర్ణాటక బళ్లారి ప్రజలు, తమిళనాడులోని నీలగిరి,కృష్ణ గిరి ప్రాంతాల వారు కూడా మమ్మల్ని ఆంధ్ర ప్రదేశ్ లో కలుపుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి పాలన బాగుందని వారంతా అంటున్నారని అన్నారు కృష్ణయ్య. ఉమ్మడి రాష్ట్రంలో బీసీలు, ఎస్సీ, ఎస్టీలకు మంత్రి పదవులు కూడా లభించలేదని.. జగన్ మోహన్ రెడ్డి మాత్రం పది మందికి మంత్రి పదవులు ఇచ్చారు. చంద్రబాబు మాటల్లోనే తాము బీసీల పార్టీ అని చెబుతున్నారని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news