చంద్రబాబును బట్టలు ఊడదీసి..చెప్పులతో ప్రజలు కొడతారు – అంబటి రాంబాబు

-

చంద్రబాబు మాటలు చూస్తుంటే జాలేస్తోందని.. ముఖ్యమంత్రి తీవ్రవాదిలాగా తయారు అయ్యారని… క్విట్ జగన్ అని అంటున్నాడని చంద్రబాబు పై ఫీ అయ్యారు అంబటి రాంబాబు. నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడి మాటలేనా అవి?? అని నిలదీశారు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అని.. బొబ్బిలి సినిమా గుర్తుకు తెచ్చుకుని ఆవేశం తెచ్చుకోండి అంటున్నాడు చంద్రబాబు అని నిప్పులు చెరిగారు.

ఎన్టీఆర్ సినిమాలు చూస్తే చంద్రబాబు చేసిన మోసం అర్ధమై ప్రజలు చెప్పులు తీసుకుని కొడతారని చురకలు అంటించారు. చంద్రబాబును బట్టలు ఊడదీసి ప్రజలు కొడతారని హెచ్చరించారు.

ఆగష్టు లో నెల్లూరు బ్యారేజ్, మేకపాటి గౌతమ్ రెడ్డి బ్యారేజ్ ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారని.. డయాఫ్రమ్ వాల్ పై చంద్రబాబు చర్చకు సిద్ధమా ? అని నిలదీశారు. చంద్రబాబు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలని.. ప్రజలు తిరగబడటం వల్లే లోకేష్ మంగళగిరిలో ఓడిపోయాడని నిప్పులు చెరిగారు. చంద్రబాబు తోడల్లుడే ఓ పుస్తకం లో చంద్రబాబు హింసను ప్రోత్సహిస్తాడని రాశారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news