జిరాక్స్ కోసం వచ్చిన బాలికపై అత్యాచారయత్నం..!

-

ప్రస్తుతం రోజు రోజుకు సమాజంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ లో అత్యాచార ఘటనలు ఎక్కువవుతున్నాయి. వారం రోజుల కిందట నంద్యాల జిల్లా ముచ్చుమర్లలో ఓ బాలిక పై మైనర్ బాలురు అత్యాచారం చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. అలాగే 6 నెలల పసికందుపై వరసకు తాతఅయ్యే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇలాంటి దుర్బుద్దుల కోసం ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా అవి వారికి చుట్టాలుగా మారుతున్నాయి.

తాాజాగా ఆంధ్ర ప్రదేశ్ లో మరో ఘటన చోటు చేసుకుంది. జిరాక్స్ కోసం వచ్చిన బాలికపై అత్యాచారయత్నం చేశారు.   అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నార్పాల మండలంలో 8వ తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారయత్నం చేసాడు జిరాక్స్ షాపు యజమాని నాగరాజు. భయంతో కేకలు వేసింది బాలిక. దీంతో హుటాహుటిన స్థానికులు అక్కడికి చేరుకొని  నాగరాజుకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు స్థానికులు.

Read more RELATED
Recommended to you

Latest news