దారుణం : ఎర్రచందనం కోసం వెళ్లి ఆకలితో మృతి !

-

తిరుపతిలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనుమానాస్పద స్థితిలో ఎర్రచందనం స్మగ్లర్ మృతి చెందాడు. యర్రావారిపాళ్యం మండలం, ఒఎస్ గొల్లపల్లెలోని కృష్ణయ్య పొలంలో ఎర్రచందనం స్మగ్లర్ మృతదేహం లభ్యం అయింది. శరీరంపై ఎలాంటి గాయాలు లేక పోవటంతో అటవీ అధికారుల భయంతో పరుగులు పెడుతూ విద్యుత్ తీగ తగిలి మృతి చెందారా? ఆకలితో చనిపోయారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కడప జిల్లా రాజంపేటకు చెందిన ఫారెస్టు అధికారులు నిన్న చేసి కూంబింగ్ చేశారు. ఈ క్రమంలో అక్కడి నుండి పారిపోయి వచ్చినట్టు భావిస్తున్నారు స్థానికులు. నిన్న 123 దుంగలు, 8 మంది ఎర్రచందనం కూలీలను రాజంపేట అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ కూలీ వారి నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ మరణించి ఉంటారని భావిస్తున్నారు. దీని మీద పూర్తి సమాచారం అందాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news