న్యూ ఇయర్ సందర్భంగా విజయవాడలో ఆంక్షలు

-

న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా విజయవాడలో పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతి రానా టాటా తెలిపారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఐదుగురికి మించి జనం గుమి గూడడానికి వీల్లేదని.. కోవిడ్ నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. ముఖ్యంగా 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని తెలిపారు.

రోడ్లపై కేక్ కట్ చేయడాలు, బైక్ లేదా కార్లతో వేగంగా వెళ్లడానికి వీలు లేదన్నారు. ఇక పబ్, మరియు రెస్టారెంట్ లు పార్టీలకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేశారు. అలాగే బార్ అండ్ రెస్టారెంట్స్ రూల్స్ పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక రోడ్లపై భారీ శబ్దాలతో డీజేలకు అనుమతి లేదన్నారు సిపి కాంతి రానా టాటా.

Read more RELATED
Recommended to you

Latest news