స్థిరత్వం లేని టీడీపీ… గాలి తీసేస్తున్న బీజేపీ!

-

స్థిరమైన అభిప్రాయాలు లేకపోతే రాజకీయల్లో బ్రతుకు బంతాటైపోద్ది! ఎవరికి దొరికితే వాళ్లు తన్నుతూనే ఉంటారు! అందుకే మంచైనా చెడైనా ఒక స్థిరమైన అభిప్రాయాన్ని నమ్ముకుని ముందుకుపోతేనే రాజకీయాల్లో క్రెడిబిలిటీ ఉంటుంది! ఈ విషయం ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన పార్టీ.. తెలుగుదేశం! వారికి స్థిరమైన అభిప్రాయాలు లేకపోవడంతో బీజేపీ నేతలు ఒక ఆటాడుకుంటున్నారు!!

అవును… బీజేపీ – టీడీపీ కలయికలో రాష్ట్రం మామూలుగా ఉండదు, అవి రెండూ కలిస్తే ఏపీ “ఎక్కడికో”పోతుంది, టీడీపీ – బీజేపీల కలయిక చారిత్రక అవసరం, మోడీని మించిన మగాడు లేడు అని చెప్పిన చంద్రబాబు & కో.. అంతలోనే మళ్లీ… బీజేపీ రాష్ట్రానికి ద్రోహం చేసింది, అందుకే రక్తం మరిగిపోయి వారితో విభేదిస్తున్నాము, మోడీ సరైన వ్యక్తి కాదు దుర్మార్గుడు, అమిత్ షా దుష్టుడు అన్నరేంజ్ లో ప్రకటనలు చేసేస్తుంటారు టీడీపీ నేతలు!! ప్రస్తుతం ఈ పాయింట్ మీదే అడ్డంగా దొరికిపోయారు టీడీపీ నేతలు!

తాజాగా బెజవాడ ఫ్లైఓవర్ బ్రిడ్జిల ఓపెనింగ్ క్రెడెట్ ని కొట్టే పనిలో ఉన్న టీడీపీ నేతలు.. ఆ క్రమంలో బీజేపీ నేతల భజన చేయడం మొదలుపెట్టారు! అందులో భాగంగా మైకందుకున్న కేశినేని నాని… అభివృద్ధి విషయంలో 2014-19 మధ్యకాలం ఏపీకి స్వర్ణయుగమని, ఆ అయిదేళ్లు రాష్ట్రం ముఖచిత్రం మారిపోయే ప్రాజెక్టులు వచ్చాయని, ఆ క్రెడిట్ మొత్తం చంద్రబాబుతోపాటు నాటి కేంద్రమంత్రులకు దక్కుతుందని, బీజేపీ చాలా సపోర్ట్ గా నిలిచిందని చెప్పుకొస్తున్నారు! సరిగ్గా ఇదే విషయాలపై ట్వీట్ అందుకున్నార్ విష్ణువర్ధన్ రెడ్డి!

“ఏమండోయ్ నాని గారు.. మీ బాబు గతంలో బిజెపి గతఐదేళ్లలో రాష్ట్రానికి ఏమి చేయలేదని, అందుకే నేను నారక్తం మరిగిపోయి నాడు బిజెపిని, కేంద్రాన్ని విభేదించి బయటకు వచ్చానని, రోజుకు పదికోట్ల ప్రజలసోమ్ముతో ధర్మపోరాట, ఆరాటం అని ఢిల్లీలో దీక్షలు చేశాడు. నేడు మీరెమేూ గతఐదేళ్లు స్వర్ణ యుగం కేంద్రమంత్రులందరు రాష్ట్రానికి అండగా నిలిచారని చెప్పారు. ఒకసారి నా స్వార్థ రాజకీయాల కోసం బిజెపిపై తప్పుడు ప్రచారం చేశానని బాబుగారితో ప్రజలముందు క్షమాపణ చెప్పించండి. అయినా గాని చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుంది టీడీపీ వైఖరి” అంటూ స్పందించారు!!

దీంతో బీజేపీ నేతలు.. టీడీపీ గాలి దారుణంగా తీసేసినట్లయ్యిందనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి!!

Read more RELATED
Recommended to you

Latest news