2024లో కూడా రెండు చోట్ల పవన్‌ కల్యాణ్‌ ఓడిపోతాడు – ఆర్కే రోజా

-

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019లో పవన్‌ కల్యాణ్‌ను రెండు చోట్ల ప్రజలు ఓడించారు. 2024లో కూడా అదే రిపీట్‌ అవుతుందని ఎద్దేవా చేశారు మంత్రి ఆర్కే రోజా. బద్వేలుకి మించిన మెజారిటీ ఆత్మకూరులో వైఎస్సార్‌సీపీకి వస్తుందని.. టీడీపీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అని విమర్శించారు ఆర్కే రోజా.

చంద్రబాబుది రెండు కళ్ల సిద్ధాంతం పవన్‌ కల్యాణ్‌ పోరాటం ప్రజల కోసం కాదు.. పొత్తుల కోసం అంటూ విమర్శలు చేశారు ఆర్కే రోజా. దివంగత మంత్రి గౌతం రెడ్డిపై నియోజకవర్గ వాసుల్లో చెక్కుచెదరని అభిమానం ఉంది. అలాగే సీఎం వైఎస్‌ జగన్‌ పాలనకు జనం నీరాజనాలు పడుతున్నారు. ఈ రెండు అంశాలు మేకపాటి విక్రమ్‌రెడ్డి ఘన విజయానికి సోఫానాలు కాబోతున్నాయన్నారు రోజా. అసలు ఏపీలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఓటు బ్యాంక్ లేదని ఎద్దేవా చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news