ఈడ్చి తన్నితే హైదరాబాద్‌ లో పడ్డావ్‌ – మంత్రి రోజా

-

ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం, జనసేన సైకో పార్టీలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశంలోనే అతిపెద్ద పొలిటికల్ సైకో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.

చంద్రబాబు వీధి రౌడీలా ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ మేరకు గురువారం మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు, శవాల నాయుడు అని తీవ్ర కామెంట్స్ చేశారు. కుప్పంలో చంద్రబాబు కుసాలు కదులుతున్నాయని ఫైర్ అయ్యారు.

చంద్రబాబును కుప్పం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈడ్చి తన్నితే హైదరాబాదులో పడ్డారని మంత్రి రోజా అన్నారు. పవన్ కళ్యాణ్ ను సొంత జిల్లా, నియోజకవర్గంలోనే ప్రజలు ఓడించారని ఫైరయ్యారు. చంద్రబాబు తప్పులు చేస్తే పవన్ కళ్యాణ్ నోటికి ప్లాస్టర్ వేసుకుంటారన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news