Minster Roja: స్వామికి మంత్రి రోజా సాష్టాంగ నమస్కారం..

-

మంత్రి అయ్యాక విశాఖ పర్యటనకు వెళ్లారు రోజా. ఈ పర్యటనలో వైసీపీ అధినేత కు అత్యంత నమ్మకస్తుడైన స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీనీ దర్శించుకున్నారు మంత్రి రోజా. ఈ సందర్భంగా ఆయన కాళ్ళపై పడి సాష్టాంగనమస్కారం చేశారు రోజా. ఇక ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ…. రాష్ట్రంలో అసలు సిసలైన ఉన్మాదిలా ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. 14 ఏళ్ల పాలనలో మహిళల రక్షణ కోసం చంద్రబాబు ఏనాడైనా పని చేశాడా..? అన్నారు.

కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌పై నేను ప్రశ్నించినప్పుడు నన్ను ఏడాది పాటు సస్పెండ్‌ చేయడం రాష్ట్ర ప్రజలకు తెలుసని.. చంద్రబాబు చేస్తున్న కుటిల రాజకీయాలను నమ్మే స్థితిలో ప్రజలు లేరని విమర్శించారు.

టీడీపీ హయాంలో తహసీల్దార్‌ వనజాక్షిపై ఎమ్మెల్యే చింతమనేని దాడి, విజయవాడలో టీడీపీ నాయకుడు ఓ యువతిపై లైంగికదాడికి యత్నించినప్పుడు చంద్రబాబు ఎక్కడ దాక్కున్నాడు? అని నిలదీశారు ఆర్కే రోజా. విజయవాడ ఆస్పత్రిలో మూడు రోజుల కిందట జరిగిన ఘటన అత్యంత దురదృష్టకరమైంది. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించి తక్షణమే విచారణకు ఆదేశించారన్నారు ఆర్కే రోజా.

Read more RELATED
Recommended to you

Latest news