గోరంట్ల మాదవ్ వ్యవహారంపై రోజా సంచలన వ్యాఖ్యలు

-

ఎంపి గోరంట్ల మాదవ్ వ్యవహారం పై స్పందించారు మంత్రి రోజా. సిఎం జగన్ ఎంక్వయిరీ వేశారు…అసలు వీడియో నిజమో కాదో తెలుసుకోకుండా టిడిపి నేతలు విమర్శకులు చేయడం ఎంటి.. అని నిప్పులు చెరిగారు. ఎంక్వయిరీ జరుగుతోంది …అప్పుడు అంతా తొందర దేనికి..అని ప్రశ్నించారు. ఎక్కడ ఎమీ జరిగినా రోజా ఎక్కడ అని టిడిపి,జనసేన వాళ్ళు నా జపం చేస్తున్నారని.. నామీదా వారికి ఎంత ప్రేమ ఉందో దీనిబట్టి అర్థం అవుతోందని మండిపడ్డారు.

గత టిడిపి ప్రభుత్వంలో ఎంతోమంది మహిళలపై దారుణమైన ఘటనలు జరిగినా పట్టించుకోలేదు. నారాయణ స్కూల్ ఎంత మంది ఆడపిల్ల చనిపోయారు.. ఒక్క కేసు అయినా పెట్టారా… అని నిలదీశారు.
మహిళాలకు ఇబ్బంది ఎవరైనా కలిగిస్తే జగన్ వదిలిపెట్టారు… సీరియస్‌గా యాక్షన్ తీసుకుంటారన్నారు. నేను కారు కొన్నట్లు.. అది రిషి కొండ గిఫ్ట్‌ అంటూ ప్రచారం చేశారు..చిన్నచిన్న నటీనటులు కారు కొంటున్నారని నిప్పులు చెరిగారు. నేను కారు కొనడం గొప్పానా.. దాన్ని కూడా టిడిపి నేతలు విషా ప్రచారం చేశారని మండిపడ్డారు మంత్రి రోజా.

Read more RELATED
Recommended to you

Latest news