శాసన మండలిలో ఎమ్మెల్సీ రవిబాబు సంచలన కామెంట్స్..!

-

శాసన మండలిలో ఎమ్మెల్సీ కుంభ రవిబాబు ఇవాళ సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో 40 ఏళ్ల అవినీతి సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్న అవినీతి చక్రవర్తి చంద్రబాబు గురించి ప్రజలు చర్చించుకుంటున్నారు. చంద్రబాబు 40 ప్రదేశాల్లో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని 3611 కోట్లతో సీమెన్, డిజైన్ టెక్ స్కిల్ డెవలప్ మెంట్ ఒప్పందాన్ని చేసుకున్నారు. సీమెన్ సంస్థ 90 శాతం పెట్టుబడులు పెడుతుందని 2017 జూన్ 30 జీవో నెంబర్ 04ని విడుదల చేశారు.

చంద్రబాబు చేసుకున్న ఒప్పందం ప్రకారం.. ఇప్పుడు జీవోకి సంబంధం లేదన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో రిటైర్డ్ ఆఫీసర్ సీఈవో లక్ష్మీనారాయణ, ఎండీ గంటా సుబ్బారావు కీలక పాత్ర పోషించారు. రూ.100 బాండ్ పేపర్ పై 3611 కోట్ల కాంటాక్ట్ ఒప్పందాన్ని తేదీలు వేయకుండా చేసుకున్నారు అని పేర్కొన్నారు. పది శాతం వాటాతో 370 కోట్లు.. జీఎస్టీతో సహా ఎందుకు చెల్లించారో చెప్పాలి. 371 కోట్లు కొల్ల గొట్టడానికే షెల్ కంపెనీలను సృష్టించారు. 90 శాతం ఉన్న కంపెనీకి 70 కోట్లు మాత్రమే ఖర్చు అయిందని చెప్పారు. అప్పుడు 3611 కోట్లు ఎందుకు చూపలేదని ప్రశ్నించారు. 

Read more RELATED
Recommended to you

Latest news