YS Sharmila: ఇడుపులపాయలో షర్మిల పర్యటన

-

నేడు దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 74 వ జయంతి అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం 7.30 గంటలకు ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించనున్నారు వైఎస్ షర్మిల. సర్వమత ప్రార్థనల అనంతరం ఉదయం 10 గంటలకు ఇడుపులపాయ నుంచి పాలేరు కు బయలు దేరనున్న షర్మిల.. మధ్యాహ్నం 2 గంటలకు పాలేరు పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ విగ్రహావిష్కరణ చేయనున్నారు.

ఇక అటు నేటి నుంచి కడప జిల్లాలో సీఎం జగన్‌ పర్యటించనున్నారు. సీఎం జగన్ నేటి నుంచి 10వ తేదీ వరకు కడపజిల్లా పర్యటనకు రానున్నారు. సీఎం జగన్ కడప జిల్లా వివరాలు ఇలా ఉన్నాయి. సీఎం జగన్‌ కడప టూర్‌ లో భాగంగా ఇవాళ మధ్యాహ్నం 1.30 గంటలకు కళ్యాణ దుర్గం నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి ఇడుపులపాయకు చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటలకు నేరుగా వైఎస్సార్ ఘాట్ కు చేరుకొని తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నివాళులర్పించనున్నారు.అనంతరం ఇడుపులపాయలోని ప్రార్థన మందిరానికి వెళతారు. అక్కడ సింహాద్రిపురం మండల నాయకులతో సమావేశం కానున్నారు. సాయంత్రం 5:30 గంటలకు అక్కడి నుంచి ఇడుపులపాయలోని ఇంటికి వెళ్లనున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news