జగన్‌ కు షాక్‌..ఏప్రిల్‌ లోనే ఏపీలో షర్మిల పార్టీ ?

-

ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డికి వైఎస్‌ షర్మిల షాకిచ్చేందుకు సిద్ధం అవుతోంది. ఏపిలో పార్టీ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు వైఎస్ షర్మిలా. ఇందులో భాగంగానే ముందస్తుగా 13 జిల్లా ల క్రిస్టియన్, బిసి, మైనారిటీ సంఘాల నేతలో సమావేశం జరిగింది. మీటింగ్ లో జరిగి విషయాలు… మీ ప్రాంతం లోని ప్రజలకు చెప్పి ఫీడ్ బ్యాక్ ఇవ్వాలని చెప్పారు బ్రదర్ అనీల్. మీటింగ్ లో ప్రతి ఒక్క నాయకులు షర్మిలాకు.. మద్దతు ప్రకటిస్తున్నట్లు చెప్పినట్లు సమాచారం అందుతోంది.

ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే అలోచనలలో ఉన్నారు బిసి, మైనారిటీ, క్రిస్టియన్ సంఘాల నాయకులు. వైసీపీ పార్టీ ని గెలిపించిన తరువాత తమను పట్టించుకోవడం లేదంటున్న బ్రదర్ అనీల్ కు చెప్పారు బిసి, మైనారిటీ, క్రిస్టియన్ నాయకులు. షర్మిలా… మీకు అండగా ఉంటుంది.. అని బ్రదర్ అనీల్ హమీ ఇచ్చినట్లు సమాచారం అందుతోంది.

అవకాశం ఉంటే వచ్చే నెలలోనే ఏపిలో పార్టీ పెట్టేందుకు సన్నాహాలు చేద్దామని బిసి,మైనారిటీ, క్రిస్టియన్ సంఘాల నాయకులకు చెప్పినట్లు సమాచారం. 13 జిల్లా లోని సంఘాలు ద్వారా ప్రజలను చైతన్యవంతం చేసి పెద్ద ఎత్తున తరలివచ్చే విధంగా ఎర్పాట్లు చేయాలని బ్రదర్ అనీల్ సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం అందుతోంది. పార్టీ ఎక్కడ పెట్టాలనేది త్వరలో చెపుతానని బిసి, మైనారిటీ, క్రిస్టియన్ సంఘాల నాయకులకు చెప్పినట్లు సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news