కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

-

కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఐదుగురు అక్కడికక్కడే మరణించగా మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. జాతీయ రహదారిపై రెండు లారీలు ఢీకొని ఈ ఘటన చోటుచేసుకుంది. కృత్తివెన్ను మండలం సీతనపల్లి వద్ద ఇవాళ ఉదయం 5 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రెండు లారీల డ్రైవర్లతో పాటు మరో నలుగురు మృతి చెందారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

Road accident in Kurnool Medical student killed

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘సీతనపల్లి వద్ద ఈరోజు ఉదయం 5 గంటలకు రెండు లారీలు ఢీ కొని ప్రమాదం జరిగినట్లు మాకు సమాచారం అందింది. వెంటనే మేం అంబులెన్సులతో అక్కడికి చేరుకున్నాం. అక్కడికి వెళ్లే వరకు ఐదుగురు స్పాట్ డెడ్ అయ్యారు. మరొకరు తీవ్ర గాయాలతో ఉండగా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మరణించారు. ఈ ఘటనకు గల కారణాలపై ఆరా తీస్తున్నాం. అతి వేగంగా వెళ్లడం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చాం.’ అని పోలీసులు తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news