పుతిన్ పేరు చెప్పి బాబుని ఇరకాటంలో పాడేసిన సోమిరెడ్డి!

-

స్థానిక అంశాలకంటే ప్రపంచ స్థాయి అంశాలపై అధికంగా స్పందించారనే పేరు సంపాదించుకున్న టీడీపీ నేతలు… ప్రస్తుతం పుతిన్ ని మెచ్చుకోవడంలో బిజీగా ఉన్నారు. పుతిన్ అంత గొప్ప వ్యక్తిలేరు.. కుటుంబం కంటే ప్రజలకే ఎక్కువ విలువనిస్తోన్న నేత అంటూ పొగుడుతున్నారు. అంతవరకూ బాగానే ఉంది కానీ… ఆ మాటలు కాస్తా అధికమయ్యేసరికి… అవి కాస్తా బాబుకు బౌన్స్ బ్యాక్ అవుతున్నాయి!

అవును… ప్రపంచాన్ని కుదిపేస్తున్న కోవిడ్‌ కు వ్యాక్సిన్ తయారుచేయడంలో ముందు నిలిచిన రష్యాకు టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి అభినందనలు తెలియజేశారు. అనంతరం… వ్యాక్సిన్ భద్రతను తన బిడ్డపైనే పరీక్షించిన ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ అంకితభావం చిరస్మరణీయమని కొనియాడారు. అక్కడితో ఆగకుండా… కన్న బిడ్డ కన్నా దేశ ప్రజల క్షేమమే ముఖ్యమని భావించిన పుతిన్ ప్రపంచానికే ఆదర్శప్రాయులయ్యారని సోమిరెడ్డి అభిప్రాయప్డ్డారు. దీంతో ఈ మాటలు బాబుకు అప్లై చేస్తున్నారు నెటిజన్లు.

టీడీపీ నేతలు చెబుతున్నట్లు… కన్నబిడ్డ కన్నా దేశప్రజల క్షేమమే ముఖ్యమని అక్కడ పుతిన్ తలిస్తే… ఏపీలో చంద్రబాబు మాత్రం అందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. రాష్ట్ర ప్రజలు, రాజధాని రైతులు ఏమైపోయినా పర్లేదు.. తన ఆరోగ్యమే తనకు ముఖ్యం, తన పుత్రుడి క్షేమమే తనకు అతిముఖ్యం అని తలచి నడుచుకుంటున్నారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనలో ప్రజలు చనిపోయినా.. విజయవాడ కోవిడ్ సెంటర్ లో అగ్ని ప్రమాధం జరిగి అంతమంది మరణించినా.. తాను మాత్రం హైదరాబాద్ వదిలి రావడం లేదు.. మృతుల కుటుంబాలను పరామర్శిద్దామన్న ఆలోచన కూడా చేయడం లేదు!!

మరి ఈ లెక్కన చూసుకుంటే.. పుతిన్ ఆలోచనా విధానానికి – చంద్రబాబు ఆలోచనలకు ఎంత తేడా ఉంది. ఈ విషయం టీడీపీ నేతలు బౌన్స్ బ్యాక్ అవుతాయని మరిచి… పాపం పుతిన్ ని తెగ పొగిడేస్తున్నారు. అవి కాస్త బాబుకు బౌన్స్ బ్యాక్ అయ్యేలా చేశారు.. అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు!!

Read more RELATED
Recommended to you

Latest news