చంద్రబాబు ప్రత్యేక హోదా వద్దన్నారు – సోము వీర్రాజు ఫైర్

-

చంద్రబాబు ప్రత్యేక హోదా వద్దన్నారని బీజేపీ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. చంద్రబాబు సీబీఐని ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం లోకి రావద్దన్నారు.. కేంద్ర ప్రభుత్వ సంస్దలు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం లోకి అనుమతించలేదని నిప్పులు చెరిగారు. శాంతి భద్రతలు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటాయి..చంద్రబాబు తాను సీఎంగా ఉన్న సమయంలో అనుమతించకుంటే జగన్ పాదయాత్రలు చేసేవారా అంటున్నారన్నారు.

ఐదేళ్లు జగన్ ను రోడ్లపై నడిపించారు.. బెంగాల్ ఐదు వందల మంది బీజేపీ కార్యకర్తలు హత్యకు గురైనా మేము ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేస్తున్నామని తెలిపారు. ప్రతీ విషయంలో కేంద్రాన్ని విమర్శించటం సరికాదు..చంద్రబాబు తన వైఖరి మార్చుకోవాలని కోరారు.

దమ్ముంటే చంద్రబాబు ముందుకు వస్తే ఒకే వేదికపై చర్చకు సిద్దం..చంద్రబాబు ప్రత్యేక హోదా వద్దన్నారు..ఇప్పుడు సభలు పెడుతున్న చంద్రబాబును అప్పుడు ప్రత్యేక హోదా ఎందుకు వద్దన్నారో ప్రశ్నిస్తున్నారా అని నిప్పులు చెరిగారు. చంద్రబాబు కేంద్రంలో చక్రం తిప్పి ఐదుగురు ప్రధానులను మార్చినప్పడు రైల్వే జోన్ తేవచ్చుకదా.. అని ప్రశ్నించారు. చంద్రబాబు మా పెద్దలను వెళ్లి కలసివచ్చారు.. వారు పొత్తులపై నిర్ణయం తీసుకుంటారన్నారు. నేనే మాట్లాడిన దాంట్లో తప్పులు ఉంటే చెప్పాలి..చంద్రబాబు వస్తే ఆయన్నే అడుగుతానని సవాల్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news