KCR, కాంగ్రెస్, కమ్యూనిస్టులది సూడో మనస్తత్వం – సోము వీర్రాజు

-

తెలంగాణ సీఎం KCR, కాంగ్రెస్, కమ్యూనిస్టులది సూడో మనస్తత్వం అని ఫైర్ అయ్యారు సోము వీర్రాజు. బీసీలను చిన్న చూపు చూసే పార్టీలు….బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రధాన పార్లమెంట్ భవనం ప్రారంభిస్తే వ్యతిరేకిస్తారా…? అని అగ్రహించారు. నరేంద్ర మోదీని వ్యతిరేకిస్తున్న పార్టీలు బీసీ వ్యతిరేకులు….KCR హైదరాబాద్ లో నిర్మించిన సచివాలయం ప్రారంభోత్సవం గవర్నర్ తో చేయించారా…? అని నిలదీశారు.

కొత్త రాష్టల ఏర్పాటుకు సోనియాగాంధీని కాంగ్రెస్ నాయకులు తీసుకుని వెళ్ళ లేదా…..?. కేసీఆర్ సహా అన్ని పార్టీలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్టీ మహిళను రాష్ట్ర పతిగా ప్రతిపాదిస్తే ఏకగ్రీవంగా ఎన్నిక కాకుండా అడ్డుపడ్డారు….కమ్యూనిస్టులు కార్పొరేట్ శక్తులు…చైనా,రష్యాలకు గొడుగులు పడుతున్నారని అగ్రహించారు సోము వీర్రాజు. NTR గొప్పతనాన్ని ప్రధాని మన్ కీ బాత్ లో ప్రస్తావించారు.. అది అందరికీ గర్వకారణం అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news